నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో?!

Edari Rama Krishna
ఈ మద్య ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలిగిపోయిన వారు ప్రస్తుతం విలన్లుగా రాణిస్తున్నారు.  ఇదే వరుసలో యంగ్ హీరోలు కూడా మంచి ఛాన్స్ వస్తే విలన్ అవతారం ఎత్తడానికి రెడీగా ఉన్నారు.  టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘సరైనోడు’చిత్రంతో విలన్ గా మారాడు ఆది.  ఇదే వరుసలో పలువురు హీరోలు విలన్ గా నటించడానికి ముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో విక్రమ్ కుమార్, నాని కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఈ వార్తలకు ఎవరూ ఖండించలేదు..పైగా ఈ రోజున ఈ సినిమా లాంచ్ సందర్భంలో తేలిపోయింది. ఎందుకంటే ఈ సినిమా పూజా కార్యక్రమాలకి కార్తికేయ కూడా హాజరయ్యాడు.  అంతే కాదు నాని .. విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. 

దాంతో తన తదుపరి చిత్రానికి విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన ఐదుగురు కథానాయికలు కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. వాళ్లలో కీర్తి సురేశ్ .. మేఘ ఆకాశ్ .. ప్రియా వారియర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.  అయితే ఈ హీరోయిన్లే కాకుండా ఈ రోజున పూజా కార్యక్రమాల్లో మరో కథానాయిక కూడా మెరిసింది. ఈ కొత్తమ్మాయి ఎవరనే విషయమే తెలియాల్సి వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: