సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు చేస్తూనే బిజినెస్ పై కూడా పెడుతున్న ఫోకస్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే ఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించి తను నటించిన కొన్ని సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతున్న మహేష్ రీసెంట్ గా ‘ఎఎంబీ సినిమాస్’ బ్రాండ్ తో మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవడమే కాకుండా ఆవిషయంలో కూడ మహేష్ విజయం సాధించడంతో ఇతడి స్పూర్తి తో చాలామంది టాప్ హీరోలు మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు.
ఇది ఇలా ఉండగా మహేష్ బాబు వెబ్ సీరీస్ నిర్మాణంలో కూడా అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సీరీస్ నిర్మాణం అంతా మహేష్ భార్య నమ్రత పర్యవేక్షణలో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. 'నాన్నకు ప్రేమతో' సినిమాకు పనిచేసిన హుస్సేన్ షా కిరణ్ ఈ వెబ్ సీరిస్ కు దర్శకత్వం వహించబోతున్నాడు.
‘చార్లీ' టైటిల్ తో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సీరీస్ కు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వెబ్ సీరీస్ కు హీరో ను ఎంపిక చేసే విషయంలో అనుకోకుండా మహేష్ కు ఊహించని సమస్యలు ఎదురౌతున్నట్లు సమాచారం. మొదట్లో ఈ వెబ్ సిరీస్ కు హీరో గా ఒక కొత్త నటుడిని పరిచియంచేద్దాం అనుకున్నారట. అయితే మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ ఈ వెబ్ సిరీస్ లో హీరో గా నటిస్తానని ఆసక్తి కనపరచడంతో మహేష్ ఆలోచనలు మారిపోయినట్లు సమాచారం.
ఈవిషయాలు తెలుసుకున్న మహేష్ అన్నయ్య రమేశ్ కొడుకు జయకృష్ణ కూడ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తానని చెపుతూ ఉండటడంతో వీరిద్దరి మధ్య ఎవరిని ఈవెబ్ సిరీస్ కు హీరోగా నటింపచేయాలి అన్న విషయమై మహేష్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు సమాచారం. దీనితో ఈ వారసుల పోరుకు చెక్ పెట్టేలా మహేష్ ఈ వెబ్ సిరీస్ కు ముందుగా అనుకున్నట్లుగానే ఒక కొత్త హీరోతో నిర్మిచి ఈ అనవసరపు పోరుకు చెక్ పెట్టాలని అలోచనలు చేస్తున్నట్లు సమాచారం..