రామ్ చరణ్ను ఆనందంలో ముంచెత్తిన నయనతార నిర్ణయం..!?
సౌత్ ఇండియాలో తిరుగులేని తారగా వెలుగొందుతోంది నయనతార. దక్షిణాదిలోని అన్నిభాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉందామె. తెలుగులో ఆమె చిరంజీవి సరసన సైరా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ నిర్మాత.
తాజాగా సైరా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని రామ్ చరణ్ తేజ నయనతారకు విజ్ఞప్తి చేశారట. ఎందుకంటే నయనతార ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనదు. ఈ విషయంలో ఇబ్బంది రాకుండా ఆమె ముందుగా సినిమాకు సంతకం చేసేటప్పుడే నిర్మాతలకు క్లారిటీ ఇస్తుంది.
ఆమెకు ఉన్న డిమాండ్ కారణంగా నిర్మాతలు కూడా ఆమె షరతులకు ఒప్పుకుని మరీ అవకాశాలు ఇస్తున్నారు. సైరా సినిమా విషయంలోనూ అదే జరిగింది. కానీ ఈ సినిమా ప్రమోషన్ కు నయనతార వస్తే ఆ క్రేజ్ వేరే ఉంటుందని ఆశించిన రామ్ చరణ్.. ఆమెకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారట.
మెగాస్టార్ సినిమా కావడం.. రామ్ చరణ్ ప్రత్యేకంగా కోరడంతో నయనతార మెత్తపడినట్టు తెలుస్తోంది. సైరా సినిమా కోసం తన రూల్స్ పక్కకుపెట్టేసి ప్రమోషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నయనతార నిర్ణయంతో రామ్ చరణ్ ఫుల్ ఖుషీ అవుతున్నారట.