టీవీ: రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ సింగర్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది సింగర్ కౌసల్య.. ఈమె 1999లో నీకోసం అనే సినిమాతో పాటలు పాడి పరిచయమయ్యింది. ఆ తర్వాత ఎంతో మంది యంగ్ హీరోల చిత్రాలలో కూడా పాటలు పాడి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా హీరోయిన్ కళ్యాణికి చాలా చిత్రాలలో డబ్బింగ్ చెప్పి మరింత పాపులారిటీ అందుకుంది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కౌసల్యాకు బాగా కలిసి వచ్చింది. కానీ తన పర్సనల్ లైఫ్ విషయం మాత్రం అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు.

కౌసల్యకు ఒక కొడుకు పుట్టిన తర్వాత తన భర్తతో విభేదాలు కారణంగా విడాకులు తీసుకుంది. అయితే అందుకు సంబంధించి పూర్తి విషయాలను మాత్రం ఇప్పటివరకు తెలియజేయలేదు.. తాజాగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్య తన విడాకులు కావడానికి ముఖ్య కారణాలు తెలియజేయడం జరిగింది.. తన భర్త తన ఇంట్లో తనకు స్వేచ్ఛ ఇచ్చేవాడు కాదని అతనితో పాటు ఆయన కుటుంబం కూడా తనని చాలా చిత్ర హింసలకు సైతం గురి చేస్తూ ఉండేదని తెలియజేసింది.

వీటన్నిటికీ తోడు తన భర్త మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఈ విషయం తనకు తెలియడంతో విడాకులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుని విడిపోయానని తెలిపింది సింగర్ కౌసల్య.. అయితే తన కొడుకు బాధ్యత తీసుకొని పెద్ద చేశాను ప్రస్తుతం తన అబ్బాయి తనని ఒంటరిగా ఉండకుండా తోడు ఉండేందుకు ఇంకో పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు అంటూ వెల్లడించింది సింగర్ కౌసల్య. ప్రస్తుతం కౌసల్య చేసినటువంటి ఈ వాక్యాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి తన కుమారుడి కోరిక మేరకు కౌసల్య వివాహం చేసుకుంటుందేమో చూడాలి మరి.. ప్రముఖ సింగర్ సునీత కూడా గడిచిన కొన్నేళ్ల క్రితం రెండవ వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. మరి ఆమె బాటలో కౌసల్య వెళుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: