హాస్పటల్ లో రవితేజ షాక్ అయిన అభిమానులు !

Seetha Sailaja
ఎవరైనా ఒక సెలెబ్రెటీని ఒక హాస్పటల్ లో చూస్తే చాలు అతడికి ఎదో అయిపోయింది అంటూ వార్తలు హడావిడి చేయడం సర్వసాధారణం. కొన్నిరోజుల క్రితం మణి రత్నం చెన్నైలోని అపోలో హాస్పటల్ కు తన రొటీన్ చెకప్ కు వెళితే మణి రత్నంకు ఏమైంది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రవితేజ అభిమానులకు కూడ ఏర్పడింది. 

అయితే ఇక్కడి సందర్భం వేరు. రవితేజ లేటెస్ట్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు హైదరాబాద్ చిత్రపురి కాలనీ పరిసరాల్లోని సన్ షైన్ ఆస్పత్రిలో దర్శకుడు శ్రీనువైట్ల చిత్రీకరించాడు. అయితే ఈ హాస్పటల్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సందర్భంలో హాస్పటల్ బెడ్ పై ఉన్న రవితేజాను చూసి కొంతమంది మాస్ మహారాజ అభిమానులు విషయం తెలియక ఖంగారు పడినట్లు టాక్. 

ఆతరువాత అసలు విషయం తెలుసుకుని రవితేజ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈ హాస్పటల్ సన్నివేశాల చిత్రీకరణ తరువాత ఈసినిమాకు సంబంధించి అమెరికాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాలో చాలాకాలం తరువాత నటిస్తున్న ఇలియానా రవితేజాల మధ్య చాల ఘాటైన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. 

గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘కిక్’ సూపర్ హిట్ అయిన నేపధ్యంలో అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని మళ్ళీ శ్రీనువైట్ల పట్టుపట్టి ఈ కాంబినేషన్ సెట్ చేసాడని తెలుస్తోంది. అయితే ‘కిక్’ తర్వాత ఫ్లాప్ పెయిర్ గా ముద్రపడిన ఈజంట క్లిక్ అవుతుందని శ్రీను వైట్ల చాల అంచనాలు పెట్టుకున్నాడు. ఈమధ్య కాలంలో వరస పరాజయాలు చూస్తున్న శ్రీనువైట్ల ఈమూవీని ఏదోవిధంగా హిట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ పై తన సర్వశక్తులు ధారపోసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి శ్రీనువైట్ల అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: