తెలుగు ఇండస్ట్రీలోకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లీడర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రానా. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడిగా..డి సురేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రానాని ఆజానుభాహుడు..టాలీవుడ్ హల్క్ అని పిలుచుకునే రానా ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో రానా, ప్రభాస్ లు ఇద్దరు సమవుజ్జీలుగా నిలిచిన విషయం తెలసిందే. ఇద్దరికీ జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. బాహుబలి 2 షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ‘ఘాజీ’ చిత్రంతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు.
రానా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తెలుగు లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా నటిస్తున్నారు. గత సంవత్సరం తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు.. నేనే మంత్రి చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు రానా. ప్రస్తుతం రానా కంటి సర్జరీ చేయించుకున్నాడు.
దాంతో కొంత కాలం చిత్రాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్జరీ కోసం డాక్టర్ల సూచన మేరకు లో సోడియం డైట్ తీసుకోవడంతో బాగా బరువు తగ్గిపోయాడట. చికిత్సలో భాగంగా త్వరలో సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నాడు. దాంతో అక్కడ కొంత కాలం బెడ్ రెస్ట్ తీసుకోక తప్పదు. గతంలో రానా ఆరోగ్యంపై రక రకాల రూమర్లు వచ్చాయి..వాటిపై డిసురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.