టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా ఈ మధ్య కాలంలో తెలుగులో నటించలేదు. 2012లో చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమానే ఆఖరిది. ఆ తరవాత ఈ బ్యూటీ బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైపోయింది. తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూసినా యంగ్ హీరోయిన్ల హవా జోరుగా కొనసాగడంతో బాలీవుడ్ లోనే ఉండిపోయింది. ఆ మద్య ఇలియానా ఓ ఐటమ్ సాంగ్ లో నటించబోతుందని వార్తలు వచ్చాయి..కానీ అది కూడా జరగలేదు.
ఆరేళ్ల విరామం తరవాత ఇల్లీ మళ్లీ తెలుగు తెరపైకి వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పోకిరి చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని ఈ గోవా బ్యూటీ తనవైపుకు తిప్పేసుకుంది. ఆ తరువాత జల్సా, జులాయి, కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో పెరిగిన క్రేజ్ తో ఇలియానా బాలీవుడ్ కు వెళ్లి ఆశాభంగం చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలియానాకు మరో గోల్డెన్ ఛాన్స్ తలుపు తట్టింది.
శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో రూపొందబోయే అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకుంది.ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మైత్రి మూవీస్ సంస్థ ఇలియానాని టాలీవుడ్ రీ ఎంట్రీకి స్వాగతం పలికింది. దర్శకుడు శ్రీనువైట్ల కూడా ఐలియానా రీఎంట్రీని ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు. రవితేజ సరసన ఇలియానా ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించింది. ఇలియానా, రవితేజ కాంబినేషన్ లో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాలు వచ్చాయి.
Welcome back @Ileana_Official 😊#AmarAkbarAnthony pic.twitter.com/mWBDlogVAd— Mythri Movie Makers (@MythriOfficial) June 27, 2018