విజయ్ దేవరకొండ మ్యానియా ముందు నిలబడలేకపోయిన ఆటాప్ హీరోలు !

Seetha Sailaja
నిన్నరాత్రి హైదరాబాద్ లో జరిగిన 65వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో విజయ్ దేవర కొండ క్రేజ్ ముందు చిరంజీవి బాలకృష్ణ జూనియర్ ప్రభాస్ లు నిలబడలేక పోవడం ఆశ్చర్యకరంగా మారింది. గత సంవత్సరానికి సంబంధించిన తెలుగు సినిమాలలో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రభాస్ ‘బాహుబలి 2’ జూనియర్ ‘జై లవ కుశ’ సినిమాలలోని ఈ హీరోల నటనను కాదని బెస్ట్ యాక్టర్ అవార్డుకు ‘అర్జున్ రెడ్డి’ మూవీలో నటించిన విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపిక కావడం సంచలనంగా మారడమే కాకుండా టాప్ హీరోల అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. 

అదేవిధంగా ‘ఫిదా’ సినిమాతో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవికి బెస్ట్ హీరోయిన్ అవార్డు రావడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. ‘బాహుబలి’ లో దేవసేన పాత్రను పోషించిన అనుష్కను కాదని సాయి పల్లవికి ఈ అవార్డు రావడం హాట్ న్యూస్ గా మారింది. అయితే ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాను తీసిన రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్
అవార్డ్ రావడంతో ‘బాహుబలి’ కేవలం రాజమౌళికి మాత్రమే పనికివచ్చిందా అన్న కామెంట్స్ కు మరొకసారి బలాన్ని చేకూర్చింది. 

అయితే భల్లాల దేవాగా అద్భుతమైన నటనను ప్రదర్శించిన రానాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు రావడం నిన్నటి కార్యక్రమంలో మరో ట్విస్ట్. ఇది ఇలా ఉండగా నిన్నటి కార్యక్రమంలో స్పెషల్ డాన్స్ లు చేసి రకుల్ ప్రీత్ రెజీనాలు ఈ అవార్డ్స్ ఫంక్షన్ కు హైలెట్ గా నిలిచారు. 

నేవీ బ్లూ కలర్ గౌన్ తో సెక్సీ లుక్స్ తో హడావిడి చేసిన రకుల్ ప్రీత్ ఎక్స్ పోజింగ్ నిన్నటి ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ కు హైలెట్. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా కెమెరాలు అన్నీ రకుల్ గౌను వైపు అదేవిధంగా ఆమె ఎక్స్ పోజింగ్ వైపు ఫోటోలు తీస్తూ హడావిడి చేసాయి అంటే ఆమె ఎక్స్ పోజింగ్ ఏరేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. నిన్నటి కార్యక్రమంలో కేవలం మూడు నిముషాల డాన్స్ కోసం రకుల్ కు 25 లక్షలు పారితోషికంగా ఇచ్చారు అన్న వార్తలు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: