హాట్ టాపిక్ గా మారిన మెగా షేరింగ్ ప్రాజెక్ట్ వివరాలు !

Seetha Sailaja
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రికెట్ టీమ్ సభ్యుల సంఖ్యకు చేరిపోయిన మెగా హీరోల లిస్టు అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం పెరిగిపోయిన ఈ మెగా హీరోల లిస్టుతో వారి సినిమాలకు వారి కుటుంబ సభ్యులు నటిస్తున్న సినిమాలే పోటీగా మారుతున్న పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో మెగా యంగ్ హీరోలు అంతా ఒక మెగా షేరింగ్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత పుట్టినరోజు పార్టీలో వచ్చినట్లు సమాచారం. ఈపార్టీకి అల్లు అర్జున్ నుండి సాయి ధరమ్ తేజ్ వరకు మెగా యంగ్ హీరోలు అంతా వచ్చినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం మెగా యంగ్ హీరోలలో సాయి ధరమ్ తేజ్ అల్లు శిరీష్ లకు ఎదురీత ఏర్పడుతున్న నేపధ్యంలో వీరిద్దరినీ ఆదుకోవడానికి ఈ మెగా యంగ్ హీరోలు అంతా ఒక మాస్టర్ ప్లాన్ రచించినట్లు టాక్. ఈ పధకం ప్రకారం అల్లు అర్జున్ నుండి సాయి ధరమ్ తేజ్ వరకు తమ దగ్గరకు కథలు చెప్పడానికి వస్తున్న రచయితలు దర్శకుల కథలను ఓపికగా విని ఆ కథలు తమకు మాత్రమే కాకుండా మెగా యంగ్ హీరోలలో మరేవ్వరికైనా సరిపోతాయా అన్న కోణంలో ఆలోచనలు చేస్తారట.

అంతేకాదు తమ దగ్గరకు వచ్చే యంగ్ డైరెక్టర్స్ చెప్పే కథలు విని ఆకథకు డేట్స్ ఇచ్చే పరిస్థితి తమకు లేకపోయినా ఆకథకు తమ మెగా ఫ్యామిలీలోని మరో యంగ్ హీరో ఆకథకు పూర్తిగా సరిపోతాడు అన్న సలహాలు కూడ ఇచ్చి తమ కుటుంబంలోని ఒకరినొకరు చాల వ్యూహాత్మకంగా ప్రమోట్ చేసుకుంటారని టాక్. మెగా యంగ్ హీరోలు లేటెస్ట్ గా ఆలోచనలు చేస్తున్న ఈ షేరింగ్ ప్రాజెక్ట్ విషయాలు ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. దీనినిబట్టి చూస్తుంటే భవిష్యత్ లో టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేయడానికి మెగా యంగ్ హీరోలు సంయుక్తంగా భారీ ప్రణాళికలు రచిస్తున్నారు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: