ఆ వీడియో యాంకర్ రష్మీకి కన్నీరు తెప్పించిందట..!

Edari Rama Krishna
తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షోతో పరిచయం అయిన యాంకర్లు అనసూయ, రష్మి.  జబర్ధస్త్ ప్రారంభం అయిన కొత్తలో యాంకర్ అనసూయ తన హాట్ అందాలతో కుర్రాళ్ల మనసు దోచింది.  మత్తెక్కించే మాటలు..చిట్టిపొట్టి డ్రెస్సులతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.  అతి తక్కువ సమయంలో ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ రావడంతో పలు ఛానల్స్ లో యాంకర్ గా బిజీ అయ్యింది.  అంతే కాదు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంతో...బజర్ధస్త్ కి బ్రేక్ చెప్పింది.

అనసూయ ప్లేస్ లో యాంకర్ గా రష్మీ ఎంట్రీ ఇచ్చింది.  ఈ అమ్మడు కూడా అనసూయ కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకోవడంతో ఏకంగా కొన్ని సినిమాల్లో హీరోయిన్ చాన్స్ కొట్టేసింది.  రష్మి కూడా పలు టీవి ఛానల్స్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.  తాజాగా యాంకర్ రష్మీ కి ఓ వీడియో కన్నీరు పెట్టించిందట. తన హృదయాన్ని కదిలించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సందేశంలో...ఈ వీడియో తనకెవరో ఫార్వడ్ చేశారని, దీనిని షేర్ చేయాలని తనకు అనిపించిందని ఆమె చెప్పింది.

వీడియో చూస్తుంటే...ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా అతను ఇంత దారుణంగా ఆమెను హింసిస్తున్నట్లు తెలుస్తోందని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఇంత దారుణంగా ఆ అమ్మాయిని హింసించడం నా కళ్లారా ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.  అందుకే దీనిని షేర్ చేస్తున్నానని, తాను చేసింది కరెక్టేనని భావిస్తున్నట్లు ఈ క్రేజీ యాంకర్ పేర్కొంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వీడియోలో అమ్మాయిని అంతదారుణంగా కొడుతుంటే..కనీసం పట్టించుకోకుండా పక్కన నిల్చున్న మహిళపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మి గౌతమ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పైశాచిక చర్యకు పాల్పడిన వారందరినీ సైబర్ విభాగం పోలీసులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కూడా మానవత్వం ఉన్న నెటిజన్లు కోరుతున్నారు.
This was a forward sent to me the girl clearly looks sedated and it’s oblivious she is being held against her wish i Dont see any news abt this incident anywhere I was expected to share this I hope I have done the right thing pic.twitter.com/tbE1SaxisS

— rashmi gautam (@rashmigautam27) February 22, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: