శివబాలాజీ ఎంత మంచి పనిచేశాడో తెలుసా..!

Edari Rama Krishna
సాధారంగా ఈ కాలంలో డబ్బు సంపాదించాలంటే ఎన్ని కష్టాలు పడుతుంటామో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు ఎవ్వరికీ చేదు కాదు..డబ్బు లేనిదే సొసైటీలో గౌరవం లేదు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు.  కొంత మంది డబ్బు సంపాదించడానికి అడ్డదారుల్లో వెళ్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. 

అక్రమ సంపాదన కోసం ఎదుటి వారిని నిలువెల్లా మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.  అలాంటిది తనకు వచ్చిన డబ్బు ఒకటి కాదు రెండు కాదు ముప్పై అయిదు లక్షలను ఒక అనాధాశ్రమం కు విరాళంగా ఇచ్చేశాడు..ప్రముఖ హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరా అని అనుకుంటున్నారా..మొన్నటి వరకు తెలుగు బుల్లి తెరపై హల్ చల్ చేసిన ‘బిగ్ బాస్’ విన్నర్ శివబాలాజి.   

బుల్లితెరపై మొట్ట మొదటి సారిగా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్’ సీజన్ 1 రియాల్టీ షో లో 70 రోజులు.. పద్నాలు మంది కంటెస్టంట్ల తో పోటీగా నిలిచి అభిమానుల హృదయాలు గెల్చుకొని వారి ఓటింగ్ తో నెగ్గారు శివబాలాజి.   ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ హీరోగా ఎదిగిన శివబాలాజీ బిగ్ బాస్ లో సెలెక్ట్ కావడం..మొదటి నుంచి తనదైన స్టైల్ తో అందరి మనసు గెలవడంతో బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ గా నిలిచారు. 

తాజాగా బిగ్ బాస్ లో పాల్గొన్న శివబాలాజీ ఆ షోలో వచ్చిన 50 లక్షలలో టాక్స్ లు పోను మిగిలిన ముప్పై అయిదు లక్షలను ఒక అనాధాశ్రమం కు విరాళంగా ఇవ్వడంతో అతని మంచి మనసును ఇండస్ట్రీ వర్గం మాత్రమే కాదు అశేష ప్రేక్షక జనం ప్రశంసల జల్లు కురిపిస్తుంది.  కాకపోతే ఈ విషయాన్ని శివబాలాజీ ఎక్కడ కూడా అనౌన్స్ చేయకపోవడంతో అతని మంచి మనసు..ఎంత గొప్పదో అని అందరు తెగ పొగిడేస్తున్నారు. 

చిన్న చిన్న దాన, ధర్మాలు చేసి ఎంతో ఆడంబరంగా ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో  35 లక్షలను మొత్తంగా అనాథలకు ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం. శివబాలాజీ భార్య స్వప్న మాధురి కూడా హీరోయిన్ గా నటించింది పలు చిత్రాల్లో . బిగ్ బాస్ లో డబ్బు కోసం వెళ్లలేదని అందుకే అక్కడ వచ్చిన డబ్బు ని ఏదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగించితే మంచిదని ఇలా చేసాడట శివబాలాజీ . 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: