ఎంత డబ్బు ఇచ్చినా..రాత్రి పూట పనిచేయను..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో రచయితగా ఎంట్రీ ఇచ్చి తర్వాత చిన్న చిన్న పాత్రలతో అలరిస్తూ..దర్శకుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సంచలనాలు సృష్టించిన పోసాని కృష్ణ మురళి ఎప్పుడూ ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.  ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాడే కృష్ణ మురళి ఈ మద్య బిజీ నటుడిగా మారారు.    బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకుంటున్న పోసాని ఎంపిక చేసుకుంటున్న పాత్రలు .. ఆయన నటనలోని వైవిధ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రస్తుతం తాను బాగా సెటిల్ అయ్యానని..ఇండస్ట్రీలో అయినా సరే, రాజకీయాల్లో అయినా సరే తనకు నచ్చని పని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని అన్నారు.  ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంత సేపైనా  పాల్గొనడానికి సిద్దంగా ఉన్నాని..కానీ రాత్రి సమయాల్లో మాత్రం పనిచేయదలచుకోలేదని చెప్పారు.

కొన్ని సందర్భాల్లో షూటింగ్ రాత్రి పూట కూడా చేయాల్సి వస్తుందని..కానీ రాత్రి పూట తనకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా చేయదల్చుకోలేదని అన్నారు. ఇది కేవలం తన ఆరోగ్య భద్రత కోసమే అని రాత్రి పూట రిస్క్ తీసుకోని చేస్తే..తన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అందుకే రాత్రి పూట షూటింగ్ లు చేయనని అన్నారు.   ఈ కారణంగా కొన్ని పెద్ద సినిమాలను కూడా వదులుకోవలసి వచ్చిందని చెప్పారు. అలాంటి సినిమాల్లో 'పైసా వసూల్' కూడా ఒకటని స్పష్టం చేశారు.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: