ఆ దర్శకుడి కోసం ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడో తెలుసా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లో సినిమాలు వస్తే..వాటిపై  విపరీతమైన అంచనాలు పెరిగిపోతుంటాయి.  తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్,రాంచరణ్ లాంటి హీరోలు కొంత మంది స్టార్ డైరెక్టర్లు..రాజమౌళి,త్రివిక్రమ్, వివివినాయక్, బోయపాటి లాంటి వారితో చేస్తే ఆ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయని గట్టి నమ్మకం.  

ఒకప్పుడు ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ ఈ మూడు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.  అయితే మొదటి రెండు సినిమాల టైమ్ లో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉన్న విషయం తెలిసిందే..అయితే యమదొంగ చిత్రంలో మాత్రం సన్నగా కరెంట్ తీగలా మారాడు. దీని వెనుక దర్శకులు రాజమౌళి కృషి ఎంతో ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.  

తాజాగా ఎన్టీఆర్ మరోసారి ఇలాంటి ప్రయోగమే చేయబోతున్నాడ..మరి ఎవరికోసమో తెలుసా..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం ఈ పని చేస్తున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఏకంగా త్రిపాత్రాభినయం చేయడం మరో విశేషం.  

ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.  ఈ చిత్రం పూర్తి కాగానే  త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తయిందని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించబోతున్నాడట.. ఇందుకోసం  ఫిట్ గా కనిపించాలని త్రివిక్రమ్ సూచించాడట. దాంతో డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిపుణుల పర్యవేక్షణలో జిమ్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: