అబ్బాయిలు విషపూరితం అంటున్న టాప్ హీరోయిన్..!?

Chakravarthi Kalyan
త్వరలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ జంటగా తొలిసారి నటించిన రారండోయ్ వేడుక చూద్దాం.. విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నటులు, దర్శకులు అంతా బిజీగా ఉన్నారు. ఈ సినిమా ట్యాగ్ లైన్ భలే ఆకట్టుకుంటోంది. అమ్మాయిలు మనశ్సాంతికి హానికరం అంటూ నాగచైతన్య ఇచ్చే స్లోగన్ ఆకర్షించేలా ఉంది. 



ఇప్పుడు ఈ స్లోగన్ పై డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి.  పలువురు స్పందిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలోని ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్‌పై బాగానే రియాక్టయ్యింది. త‌న‌ను ఎవరైనా ఇదే ప్రశ్న అంటే... అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అని క్వశ్చన్ చేస్తే.. అమ్మాయిల సంగతి పక్కకు పెట్టండి.. అబ్బాయిలు మాత్రం పాయిజనెస్‌ అని చెబుతానంటూ సెటైర్ వేసింది. 



ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ భ్రమరాంబ అనే క్యారెక్టర్ లో నటిస్తోంది. తొలిసారిగా హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నానని రకుల్ గర్వంగా చెబుతోంది. అంతే కాదు.. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో పెద్ద డోలును మెడలో వేసుకుని భలేగా వాయిస్తూ ఆకట్టుకుంది. ఈ సినిమాలో త‌న పాత్రకి ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంద‌ంటున్న రకుల్.. తాను తెలుగు నేర్చుకుంటానంటోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: