ఏపీ: ఆఖరి నిమిషంలో వైసీపీకి హ్యాండిచ్చిన లక్షల మంది.. టీడీపీ గెలుపు ఖాయమా..??

Suma Kallamadi
2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తుచిత్తుగా ఓడిపోతారని భారీ స్థాయిలో ప్రచారం జరిగింది. వైసీపీ గెలుచుకున్న ఎమ్మెల్యేలు అందరూ వేరే పార్టీలకు వెళ్లిపోయారని ఇక ఆయన పని అయిపోయిందని మాట్లాడారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్ల పోలింగ్ డేట్ అయిపోయిన తర్వాత జగన్ ఇక గెలవడం అసాధ్యం అని మరింత నమ్మకంగా ప్రచారాలు చేశారు. ఎందుకంటే పోలింగ్ తేదీన సాయంత్రం వేళ మహిళలు కుప్పలు తెప్పలుగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. వారు సాయంత్రం వేళ క్యూలో నించొని ఉదయం మూడింటి దాకా ఓట్లు వేశారు.
వారందరికీ చంద్రబాబు పసుపు కుంకుమ పేరిట పదివేల రూపాయలు ఇచ్చాడు వారంతా చంద్రబాబుకే ఓట్లు వేసి ఉంటారు ఇక జగన్ సర్దుకోవాల్సిందే అని వ్యాఖ్యలు చేశారు అయితే పోలింగ్ రిజల్ట్స్ రోజున అందరి అంచనాలు రివర్స్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి కనీవినీ ఎరుగని మెజారిటీతో టీడీపీని చిత్తు చేస్తూ గెలుపొందారు. 151 సీట్లతో ఆయన భారతదేశ ఎన్నికల చరిత్రలో అరుదైన రికార్డ్ సృష్టించారు. అయితే ఆనాడు మహిళల కారణంగా వైసీపీకి భయం కలిగింది. టీడీపీ ఆ మహిళలే తమ బలం అనుకుంది.
 అయితే ఈనాడు ఉద్యోగులు వైసిపి కి హ్యాండిచ్చి, ఆ పార్టీ ఓటమికి కారణం అవుతారని ప్రచారం జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి వ్యతిరేకంగా వీరందరూ ఓటు వేయబోతున్నారని తెలుస్తోంది. ఉద్యోగులు వైసీపీ పాలన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని టాప్ నడుస్తోంది మొన్న ఈ మధ్య ఒక ఉద్యోగిని వైసీపీ వాళ్లు 5000 ఇస్తానంటే తిరస్కరించిందట. అంతేకాదు టిడిపి పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్లి 10 వేలు ఇచ్చి ఖర్చులకు ఉంచుకోండి అని కూడా చెప్పిందట. అంటే వైసీపీ పట్ల ఉద్యోగులకు ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చని కొందరు ఈ ఘటనను హైలైట్ చేస్తున్నారు.
ఏపీలో మొత్తం నాలుగున్నర లక్షల ఉద్యోగులు ఉన్నారు వారిలో మూడున్నర లక్షల ఉద్యోగుల వరకు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్స్ వేసేశారు. అయితే ఈ ఉద్యోగులందరూ కూటమికే ఓట్లు వేశారని కొందరు ప్రచారం చేస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: