మెగా మల్టీస్టారర్ `చరణ్అర్జున్` మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా!?
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారే సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన బడ్జెట్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించాలనేది నిర్మాత ఆలోచన అని అంటున్నారు. నిర్మాత అయిన అల్లుఅరవింద్ కి రామ్చరణ్–అల్లు అర్జున్ ఇద్దరినీ ఒకే ప్రేమ్ లో చూడాలి అనేది తన కోరిక.
అందుకే ఇది తనకి డ్రీమ్ అని అంటున్నారు. `చరణ్అర్జున్` అనే టైటిల్తో సినిమా నిర్మించాలని చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు అల్లుఅరవింద్ పూర్తి బాధ్యతలను ఎత్తుకున్నారు. ఈ చిత్రాన్ని ఒకే సారి తెలుగు, తమిళ్, మళయాళం బాషల్లో చిత్రీకరించనున్నారు. ఇందులో మోహన్ లాల్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే…ఈ చిత్రాన్ని దాదాపు 90 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారని అంటున్నారు.
ఇద్దరు మెగాహీరోలు నటిస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఉండాల్సిందే అని అల్లుఅరవింద్ భావిస్తున్నరనేది ఇండస్ట్రీ టాక్స్. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదివరకే `ఎవడు` చిత్రంలో బన్ని, చరణ్ కనిపించినప్పటికీ అది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు. అందుకే ఇప్పుడు వస్తున్న చిత్రంతో అభిమానుల కోరిక తీర్చనున్నారని అంటున్నారు.