తెలుగు,తమిళ,హిందీ ఇండస్ట్రీలో విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ అంటే తెలియన వారు ఉండరు.. అంతే కాదు ఒకప్పుడు ఆమెను కలల రాణిగా భావిస్తూ చాలా మంది యువకులు ఊహాలోకంలో తెలిపోయేవారు. తన కళ్లతో ఎంతటి వారినైనా ఇట్టే కట్టిపడేసే అందం ఆమె సొంతం... ఇక ఐష్ వివాహం అబిషేక్ బచ్చన్ తో జరిగిన తర్వాత వారికి ఆరాధ్య పుట్టింది. కూతురు పుట్టాక కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కేవలం తన కూతురి బాగోగులు చూసుకుంటూనే కాలం గడిపింది.
తమ గారాల పట్టి ఆరాద్య పెరిగి పెద్దయ్యాక సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వాలని భావించిన ఐష్ జజ్బా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన రీ ఎంట్రీ చిత్రంతో అదరగొట్టాలని చూసినా ఐష్ కి ఆ సినిమా అంతగా సక్సెస్ ఇవ్వలేక పోయింది..లేడీ ఓరియెంట్ చిత్రమే అయినా తనకు మాత్రం పేరు రాలేదు. కానీ ఐష్ జోష్ ఏమాత్రం తగ్గలేదు.. ప్రస్తుతం వరుస షూటింగ్లతో బిజీగా ఉంటున్న ఐష్ తన కూతురుని కూడా లొకేషన్కి తీసుకెళ్తుంది. ప్రస్తుతం కరణ్ జోహర్ దర్శకత్వంలో యే దిల్ హై ముష్కిల్ అనే సినిమా చేస్తుంది.
ఎంత షూటింగ్ బిజీలో ఉన్న తన కూతురుని మాత్ర ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది ఐశ్వర్యరాయ్. తాజాగా ఐష్ మీడియా వారిపై గరం గరం అయ్యిందట..దానికి కారణం తన కూతురు ఆరాద్య కన్నీరు పెట్టడమే..ఐశ్యర్యరాయ్ యే దిల్ హై ముష్కిల్’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే సమయంలో కెమెరా మెన్లు,ఫోటో గ్రాఫర్లు తల్లి కూతుళ్ళను తమ కెమెరాలో బంధించేందుకు పోటి పడ్డారు.
అబిషేక్ బచన్,ఐశ్వర్య రాయ్ ముద్దుల కూతురు ఆరాద్య
వారిని తప్పించుకునే క్రమంలో కాస్త కంగారుగా డోర్ తీయడం ఆది కాస్త ఆరాద్యకు తాకి గాయం కావడం జరిగిపోయింది. దీంతో ఆరాద్య నొప్పితో వెక్కి వెక్కి ఏడ్చిందట..తన కూతురు కన్నీరు పెట్టింది మీడియానే అంటూ ఫైర్ అయింది ఐష్. ఎంత పెద్ద సినీ నటి అయినా కూతురుకి తల్లే కదా కూతురు బాధపడితే తల్లి మనసు తట్టుకుంటుందా..!