అక్కడ 'సైరా' కు బ్రేక్ ఈవెన్ అసాధ్యమేనట....!!

Mari Sithara
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి, యావరేజ్ టాక్ తో ప్రస్తుతం ఒక మోస్తరు కలెక్షన్స్  సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మించగా, ఆయన కుమార్తె సుస్మిత ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్ విభాగంలో పనిచేసారు. ఇక పాన్ ఇండియా ఫీల్ తో అత్యంత భారీ ఖర్చు మరియు సాంకేతిక విలువలతో, స్వాతంత్రోద్యమ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. 

ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తన అత్యద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. అయితే కథ మరియు కథనాలను ప్రేక్షకులకు చేరువ చేసేలా తెరకెక్కించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా వరకు ఫెయిల్ అయ్యారు. ఇక రెండవ రోజు నుండి కలెక్షన్స్ తగ్గుముఖం పట్టిన ఈ సినిమా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నత్తనడకన నడుస్తుండగా, ఓవర్సీస్ లో మరింత నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు ఓవర్సీస్ లో 2.2 మిలియన్లు రాబట్టినట్లు చెప్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. 

మరొక 1.1 మిలియన్ కొల్లగొడితేనేకాని అక్కడ బ్రేక్ ఈవెన్ ని చేరుకోదని, అయితే ప్రస్తుతం తమకున్న సమాచారం ప్రకారం అది చాలావరకు కష్టమని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాకి రన్ టైం వలన కొంత ఇబ్బంది కలుగగా, సినిమాలోని ఎమోషనల్ సీన్స్ పెద్దగా పండకపోవడం మరికొంత, ఇక రిలీజ్ కు ముందుకు ప్రమోషన్ మరియు పబ్లిసిటీ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించకపోవడం కూడా ఇంకొంత కారణంగా చెప్తున్నారు సినీ విశ్లేషకులు. మరి ఓవర్ ఆల్ గా ఓవర్సీస్ లో ఈ సైరా సినిమా ఎంత మేర కలెక్షన్ కొల్లగొడుతుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: