మల్టీస్టారర్ కోసం రెడీ అవుతున్న అఖిల్, నాగచైతన్య..?
అది కూడా ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో అని సమాచారం. విషయంలోకి వెళితే అజయ్ భూపతి మహాసముద్రం అనే టైటిల్ పేరిట సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంత కాలం నుండి ఇండస్ట్రీలో వినబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు రవితేజ నటిస్తున్నట్లు ఇంకా చాలామంది పేర్లు బయటకు వచ్చాయి కానీ ఎవరిది కూడా ఫైనల్ కాలేదు.
కాగా తాజాగా ఈ సినిమాలో అక్కినేని అఖిల్ మరియు నాగ చైతన్య ఇద్దరు కలిసి నటిస్తున్నట్లు సమాచారం. అధికారికంగా ఈ వార్త ఇంకా బయటకు రాకపోయినా కానీ వీరిద్దరు కలిసి నటించడం కన్ఫర్మ్ అని చాలామంది ఇండస్ట్రీ లో ఉన్నవారు కామెంట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతా ని కూడా తిసుకోబోతున్నారనే టాక్ కూడా వినబడుతోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే కచ్చితంగా డైరెక్టర్ అజయ్ భూపతి నోరు విప్పాల్సిందే.