అందరికంటే సైఫ్ జోన్ లో బాలయ్య.. హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఆపడం కష్టమే..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం వరకు వరుస అపజాలను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. ఇలా అఖండ , వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి అని మూడు సినిమాలతో మూడు విజయాలను అందుకోవడంతో ప్రస్తుతం బాలయ్య అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమాల విడుదల తేదీలను మూవీ బృందాలు ప్రకటించాయి. కానీ అందులో ఏ సినిమా విడుదల అవుతుందా లేదా అనే దానిపై పెద్దగా క్లారిటీ లేదు.

ఇక బాలయ్య , బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరినట్లు , ఈ మూవీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాక కూడా విడుదల తేదీకి చాలా గ్యాప్ ఉండనున్నట్లు , దానితో ఈ మూవీ కచ్చితంగా సంక్రాంతి పండుగకు విడుదల అవుతుంది అని సమాచారం. దానితో బాలయ్య ఫుల్ సేఫ్ జోన్ లో ఉన్నాడు అని , సంక్రాంతి పండుగకు బాలయ్య , బాబీ కాంబో మూవీ వస్తే మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాడు అని బాలయ్య అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: