2020 సంక్రాంతి : ఆ ఇద్దరి మధ్య గట్టి పోటీ.. చివరికి గెలిచింది అతనే..?

Pulgam Srinivas
2020 సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు , అల్లు అర్జున్ సినిమాలు విడుదల అయ్యాయి. మరి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వీరు నటించిన ఏ సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఏ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంది. చివరిగా సంక్రాంతి విన్నార్ గా ఏ మూవీ నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.
2020 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నికెవ్వరు సినిమా జనవరి 11 వ తేదీన విడుదల అయింది. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.
ఇకపోతే 2020 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఇలా ఈ రెండు సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ రెండు సినిమాలు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేశాయి. కానీ ఈ రెండు మూవీల టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి సరిలేరు నీకెవ్వరు సినిమా కంటే అలా వైకుంఠపురంలో సినిమా కాస్త ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది. ఫైనల్ గా 2020 సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా అల్లు అర్జున్ నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: