ఎన్టీఆర్‌ను పట్టించుకోని మహేష్.. ఆ సినిమా కోసం స్పెషల్ ట్వీట్..!

Amruth kumar
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ జిగ్ర , తమ్ముడి కోసం అక్క చేసే పోరాటాన్ని ఈ సినిమాలో హైలైట్ గా చూపించారు . దసరా కానుకగా ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . అయితే జిగ్రా మూవీ కి తెలుగు స్టార్ హీరోల సపోర్ట్ గ‌ట్టిగానే దక్కింది .. రాజమౌళి , రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయగా .. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంతా , త్రివిక్రమ్ , రానా వంటి వారు గెస్ట్లుగా వచ్చారు . ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలియా భట్ జిగ్ర మూవీ పై ట్వీట్ చేశారు ..

ఈ సినిమా ఇప్పటి కే  బ్లాక్ బస్టర్ హీట్ .. ఆల్ ది బెస్ట్ జిగ్రా మూవీ టీం అంటూ రాసుకోచ్చాడు. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు . దీనికి కారణం లేకపోలేదు .. ఎన్టీఆర్, కొర‌టాల‌ శివ కాంబోలో వచ్చిన దేవర గత నెల 27న ప్రేక్షకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే . ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటించారు . అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్ తెచ్చుకుంది .

అయినప్పటికీ కూడా మహేష్ ఈ సినిమాపై రియార్టీ అవలేదు పట్టించుకో లేదు కూడా .. ఇక ఇప్పుడు తన తోటి హీరో సినిమాను పట్టించుకోకుండా  జిగ్రా మూవీ పై పోస్ట్ పెట్టడంతో అభిమానులు మండి పడుతున్నారు. అంత పెద్ద హిట్ అయిన దేవర సినిమాపై ఒక్క పోస్ట్‌ కూడా వేయలేదు ఊరు పేరు లేని సినిమాపై పోస్టు పెట్టాడు అంటూ మహేష్ బాబును సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఇక మరి దీనిపై మహేష్ చాలా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: