ఓరి దుర్మార్గుడా.. కొండా సురేఖతో అలా మాట్లాడించింది ఆ స్టార్ సీనియర్ హీరోనా..?

Thota Jaya Madhuri
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. తెలంగాణ మంత్రి కొండ సురేఖ .. నాగచైతన్య - సమంత విడాకుల మేటర్ లో వేలు పెట్టి రచ్చ రంబోలా చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు మంత్రి కొండ సురేఖ అంటే అందరికీ ఒక గౌరవమైన ఫీలింగ్ ఉండేది .. ఎప్పుడూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది .. ప్రజాసేవ కోరుకుంటుంది .. ఆడవాళ్లకు మరింత రక్షణగా ఉంటుంది అని ఫీల్ అయిపోయేవారు ..అయితే ఆమె మాట్లాడిన ఒకే ఒక్క మాటతో ఆమెపై ఉన్న అభిప్రాయాన్ని మొత్తం చెరిపేసుకునింది. బుధవారం నాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాగచైతన్య -సమంతల విడాకుల మేటర్ లో 100 కి 100% కేటీఆర్ హస్తం ఉంది అంటూ సంచలన ఆరోపణ చేసిన విషయం తెలిసిందే.


అయితే అంత బాధ్యత గల పొజిషన్లో ఉన్న కొండా సురేఖ అలాంటి తప్పుడు నిందలు ఎలా వేస్తుంది అంటూ అందరూ ఆశ్చర్యపోయారు . ఆమె దగ్గర ఆధారాలు లేకుండా అటువంటి వ్యాఖ్యలు చేయదు అంటూ అభిప్రాయపడ్డారు . ఆమె మాట్లాడిన మాటలకు అటు అక్కినేని ఫ్యాన్స్ ఇటు సమంత ఫ్యాన్స్ డీప్ గా హర్ట్ అవ్వడంతో ఫైనల్లీ సమంత కి కొండ సురేఖా సారీ చెప్పింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక సంచలన మ్యాటర్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఎప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండే కొండా సురేఖ ..నాగచైతన్య - సమంతల మ్యాటర్లో కేటీఆర్ హస్తం ఉంది అని అంత స్ట్రాంగ్ గా మాట్లాడడానికి కారణం ఒక స్టార్ సీనియర్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .


మొదటి నుంచి కేసిఆర్ అన్నా.. కేటీఆర్ అన్న ..నాగార్జున అన్న అస్సలు పడని ఆ స్టార్ సీనియర్ హీరో రాజకీయ రంగు పూసుకొని ..ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న రేంజ్ లో ఇద్దరి శత్రువులను దిగజార్చాలి అన్న విధంగానే పక్కా ప్లాన్ తో అభం శుభం తెలియని కొండా సురేఖను పావుగా చేసుకుని ఆమెకి లేనిపోని విషయాలు నూరిపోసి .. మధ్యలో బకరా అయ్యేలా చేశాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో రాజకీయ రంగంలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో అంతకు మించిన రేంజ్ లోనే శత్రువులు ఉంటారు .


మన పక్కనే ఉంటూ నమ్మించి మోసం చేసే వాళ్ళు మరీ మరీ ఎక్కువ ..అలాంటి వాళ్ళలో ఇతడు కూడా ఒకడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  అయితే ఎవరు ఏది చెప్పినా విని మాట్లాడేస్తావా..? అంటూ కొండ సురేఖను కూడా దారుణంగా అడిగి కడిగి పడేస్తున్నారు . మొత్తానికి కొండ సురేఖ టైం బ్యాడ్ గా ఉంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు . అందుకే ఇలా దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన వేసుకొని మరీ ఇప్పుడు అనుభవిస్తుంది అంటూ మరికొంతమంది జనాలు మాట్లాడుకుంటున్నారు.  చూడాలి మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో ..? ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుందో.??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: