సరికొత్త సినిమా ప్రకటించిన శర్వానంద్.. ఈసారి సరిహద్దుల్లో..!?

Anilkumar
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ చార్మింగ్ హీరోస్ లో శర్వానంద్ ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు శర్వా. చాలామంది హీరోలను శర్వానంద్ కెరియర్లో హిట్స్ కంటే ప్లాప్ సినిమాలో ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. శర్వానంద్ కి వరుసగా ప్లాప్ సినిమాలు పడినా కూడా తన మార్కెట్ ఏమాత్రం దెబ్బతినదని చెప్పాలి.  రీసెంట్ గా శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఒకే ఒక జీవితం మంచి డీసెంట్ హిట్ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో

 వచ్చిన మనమే సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మించింది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. సంపత్ నంది దర్శకత్వంలో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ చార్మింగ్ హీరో హీరోగా నటిస్తున్న 38వ చిత్రమిది. ఇదొక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా. 1960 తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలియజేశారు. దీనికోసం శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో

 కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మంటలు చెలరేగుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. గ్రిప్పింగ్ యాక్షన్, ఎమోషనల్ సీక్వెన్స్‌లతో ఇంటెన్స్ నెరేటివ్‌గా సినిమా ఉండనుందని మేకర్స్ చెప్పడంతో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌ కాగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఇక ఎంతో కాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ కనీసం ఈ సినిమాతో నైనా మళ్ళీ కం బ్యాక్ ఇస్తాడా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: