దళపతి విజయ్ చివరి సినిమా దర్శకుడు అతడేనా..?

murali krishna
స్టార్‌ హీరో విజయ్‌ తన 69వ చిత్రం అనంతరం సినిమాలకు విరామం తీసుకోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా దీనిపై దర్శకుడు హెచ్‌.వినోద్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా తెలిపారు.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం రెండు సినిమాలను ట్రాక్‌లో పెట్టాడని తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ది గోట్‌  ఒకటి.ఈ సినిమాను తానే డైరెక్టర్‌ చేస్తున్నట్టు హెచ్ వినోథ్‌ క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాదు ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని ఇప్పటికే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా జోనర్ ఇది కాదట. ఓ అవార్డు ఫంక్షన్‌లో హెచ్ వినోథ్‌ మాట్లాడుతూ.. ఇది పొలిటికల్ సినిమా కాదని, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ అని చెప్పాడు. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.దళపతి 69కు సంబంధించిన హెచ్ వినోథ్‌ చేసిన తాజా కామెంట్స్‌తో ఇక ఈ సినిమా కూడా రెగ్యులర్ కమర్షియల్ పంథాలోనే సాగుతుందని అర్థమవుతోంది. మరి ఎలాంటి స్టోరీని సిద్దం చేశాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.కాగా ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటించనుండగా.. ఈ చిత్రానికి మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించబోతున్నాడు.

 వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.నిన్న జరిగిన ఓ అవార్డ్స్ వేడుకలో ఆయన పాల్గొని ఈ విషయాన్నీ వెల్లడించారు.'దళపతి 69' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది రూపొందనుంది. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్‌ గురించి ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. తాజాగా దర్శకుడు హెచ్‌ వినోద్‌ ఈ చిత్రం గురించి ఓ అవార్డు కార్యక్రమంలో మాట్లాడారు. విజయ్‌ చివరి సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు చెప్పారు. అందరూ అనుకుంటున్నట్లు ఇది పొలిటికల్‌ థ్రిల్లర్‌ కాదని.. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని పేర్కొన్నారు. దీంతో విజయ్‌ అభిమానులు సంతోషిస్తున్నారు.ఇక ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఇందులో కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. అలాగే సమంత, మమితా బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారని టాక్‌. ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్‌ స్వరాలు అందించనున్నారు. ప్రస్తుతం విజయ్‌ 'ది గోట్‌' (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌)తో బిజీగా ఉన్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఇది రానుంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: