ఒక సాంగ్ కోసం సినిమానే పెండింగ్లో పెట్టేసిన మెగా హీరోస్..?

MADDIBOINA AJAY KUMAR
మెగా హీరోలలో చాలా మంది ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా , ఏం ఏం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.

కేవలం ఈ సినిమాలోని ఒకే ఒక ఐటెం సాంగ్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతూ ఉండడంతో ఈ సాంగ్ షూటింగ్ మేకర్స్ ఆపివేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి హెల్త్ పూర్తిగా బాగయ్యాక ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు ఈ మూవీ లోని ఐటమ్ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాలోని ఐటెం సాంగ్ ను కూడా మేకర్స్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని ఐటెం సాంగ్ ను ఆ నటిపై చిత్రీకరించాలి అనే విషయంపై అనేక మంది పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు మూవీల పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: