షాక్: రాజ్ తరుణ్ - లావణ్య కేసు మరో మలుపు.. మస్తాన్ సాయి అరెస్ట్..!

Divya
సినీనటుడు రాజ్ తరుణ్, లావణ్య  పేర్లు గత కొద్దిరోజులుగా వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా తనని మోసం చేశారంటూ లావణ్య, రాజు తరుణ్ పైన కేసు పెట్టడంతో ఒక్కసారిగా ఈ ఉదాంతం బయటకి వచ్చింది. దాదాపుగా ఒక నెల రోజుల నుంచి వీరి గురించి పలు రకాల వార్తలయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరు కేసులో మరొక ట్విస్ట్ వెలుబడింది. హైదరాబాదులో డ్రస్ కేసు ఒక్కసారిగా అధికారులు తీగలాగగా అది గుంటూరు వరకు కదిరినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న పేరు మస్తాన్ సాయి ను నిన్నటి రోజున అరెస్టు కావడం జరిగిందట.

మస్తాన్ సాయి అనే వ్యక్తి పైన లావణ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందని రాజ్ తరుణ్ చెప్పడం వల్లే మస్తాన్ పేరు హైలెట్గా నిలిచింది. 2023లో గుంటూరు నగర పాలెంలో లావణ్య ఫిర్యాదు మస్తాన్ పైన చేయడంతో కేసు నమోదు అయ్యిందట.. 2023లో మస్తాన్ చెల్లెలు పెళ్లి కోసమని లావణ్యను గుంటూరుకి పిలిచారట. ఆమె హోటల్లో ఉన్న సమయంలో మస్తాన్ సాయి వెళ్లి ఆమెను కొట్టి మరి మొబైల్ తీసుకొని అత్యాచారం చేసినట్లుగా ఆమె ఫిర్యాదులో తెలియజేసింది.

ఆ వెంటనే విజయవాడ పోలీసులు కూడా మస్తాన్ సాయిపైన డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు చేయడం జరిగింది. అయితే నిన్నటి రోజున గుంటూరులో మస్తాన్ సాయిని మధ్యాహ్నం సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అతని మొబైల్ లో ఉండే కాంట్రాక్ట్స్ పైన దృష్టి పెట్టగా డ్రెస్ సప్లై ఎవరెవరికి చేశారు అనే విషయం పైన ఆరా తీయగా ఒక్కొక్క విషయాలు బయటకి వస్తున్నాయట. అయితే లావణ్య తెలిపిన విషయాల ప్రకారం.. వీరి టార్గెట్ వర్జిన్ అమ్మాయిలే అని.. చాలా మంది అమ్మాయిలను శారీరకంగా మానసికంగా కూడా మస్తాన్ వాడుకున్నాడని తన వల్ల తనకు కూడా ప్రాణహాని ఉందని అందుకే అతని పేరు ఎక్కడా చెప్పలేదని తెలిపింది లావణ్య.. అతని ఫోన్లో సుమారుగా 800 వందల ప్రైవేటు వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: