కేజీఎఫ్ 3 లో నిజంగా అజిత్ వున్నాడా..? ఈ వార్తలో నిజమెంత..?

murali krishna
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కేజిఎఫ్ సినిమా తో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు పాన్ ఇండియా స్థాయిలో దాదాపు 1000 కోట్లు కలెక్షన్స్ అందుకున్నాడు. కేజిఎఫ్ భారీ విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ 2 ను తెరకెక్కించాడు.. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. దీనితో దేశ వ్యాప్తంగా ప్రశాంత్ నీల్ పేరు మారు మ్రోగింది. ఇదిలా ఉంటే గత ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీనితో సలార్ 2 పై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యం లో కొన్నిరోజుల క్రితం అజిత్,ప్రశాంత్ నీల్  కాంబినేషన్ గురించి సోషల్ మీడియా వేదిక గా వార్తలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

వీరి కలయికతో కేజీఎఫ్3 సినిమాలో యశ్ కు బదులుగా అజిత్ హీరో గా నటిస్తారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికే రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తర్వాత ప్రాజెక్ట్స్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తాడని నెటిజన్లు కూడా అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో ఆరేళ్ల సమయం అయినా పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుందిప్రశాంత్ నీల్ తన సినిమాల స్క్రిప్ట్ వర్క్ కోసం కూడా ఎక్కువ సమయం తీసుకుంటారనే విషయం తెలిసిందే.అయితే అజిత్ ప్రశాంత్ నీల్ కలవడం వాస్తవమే కానీ సినిమా కోసం కాదని ప్రశాంత్ నీల్ మేనేజర్ నుంచి స్పష్టత ఇచ్చారు. దీనితో వీళ్లిద్దరి కాంబో లో ప్రస్తుతం సినిమా వచ్చే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.క్యాజ్యూవల్ గా వీళ్లిద్దరూ కలిశారే తప్ప అంతకు మించి వీళ్లిద్దరూ కలవడానికి ఎలాంటి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమి లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: