రామ్.. పూరి ఇద్దరికీ అక్కడ చెడు అనుభవం.. ఈసారైనా ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని , టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన ఈమేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబోలో కొంత కాలం క్రితం ఈస్మార్ట్ శంకర్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత రామ్ పోతినేని "ది వారియర్" సినిమాలో హీరోగా నటించాడు.

ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఆఖరుగా ఈ నటుడు స్కంద అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేశారు. ఈ మూవీ రామ్ కి చేదు అనుభవాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిల్చింది. ఇకపోతే ఈస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని కూడా తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేశారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

ఇలా ఈస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఇండియా మొత్తం క్రేజ్ ను సంపాదించాలి అనుకున్న రామ్ , పూరి జగన్నాథ్ కి ఇద్దరికీ కూడా అనుకున్న స్థాయిలో విజయాలు దక్కలేదు. మరి వీరిద్దరి కాంబోలో తాజాగా ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా డబల్ ఇస్మార్ట్ మూవీ రూపొందింది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో అయినా వీరిద్దరికి మంచి పాన్ ఇండియా విజయం దక్కుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: