షాకింగ్ ప్రైజ్ కి సేల్ అయిన డబల్ ఇస్మార్ట్ సౌత్ ఓటిటి హక్కులు..ఎవరికి..ఎంతకో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని తాజాగా డబల్ ఇస్మార్ట్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కావ్య దాపర్ హీరోయిన్ గా నటించిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి దర్శకత్వ వహించడం మాత్రమే కాకుండా ఈ సినిమాను నిర్మించడంలో ఒక భాగస్వామిగా కూడా పూరి జగన్నాథ్ ఉన్నాడు.

ఈ మూవీ ని పూరి జగన్నాథ్ తో పాటు చార్మి కౌర్ కూడా నిర్మించింది. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా కూడా పరవాలేదు అనే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు , అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమా యొక్క తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ ఓ టీ టీ హక్కులను ఏకంగా 33 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు , ఇది రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓ టి టి ఆఫర్ గా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను 9 కోట్లకు అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ కి విడుదల ముందే అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: