డబుల్ ఇస్మార్ట్లో సంజయ్ దత్ డబ్బింగ్ పూర్తి..!

Anilkumar
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ "డబుల్  ఇస్మార్ట్". రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్ ప్రస్తుతం డబ్బింగ్ పనులను కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా అవుతుంది. అయితే తాజాగా సంజయ్ దత్ తన పాత్రకు సంబంధించి హిందీ డబ్బింగ్‌ చెప్పినట్టు బుధవారం అప్‌డేట్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే డబ్బులు ఇస్మార్ట్" సినిమా ఒక యాక్షన్ ప్యాక్డ్

 ఎంటర్టైనర్. ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.  సంజయ్ దత్ తన కెరీర్‌లో ఇలాంటి పాత్రలు ఎన్నో చేసి మెప్పించారు. ఆయన ఈ సినిమాలో కూడా అదే జోష్‌తో నటించారని సమాచారం.  ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్ తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానితో ప్రేక్షకులకు ఈ సినిమా పై భారీ అంచనాలు

 నెలకొన్నాయి. ఇక ఇందులో కావ్య థాపర్ రామ్ తో రొమాన్స్ చేయబోతోంది. కాగా ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా  విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల  కానుంది. ఇక సంజయ్ దత్ ఫ్యాన్స్ అంతా ఈ చిత్రం పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు స్కంద హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఒక్క నెలలోనే 100 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది. అలానే ఒక మిలియన్ లైకులతో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఈ హై యాక్షన్ డ్రామా తెలుగు ఆడియన్స్‌కి పెద్దగా ఎక్కలేదు. కానీ హిందీ ప్రేక్షకులు మాత్రం సూపర్ సినిమా, యాక్షన్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: