ఆ విషయంలో తెగ భయపడిపోతున్న మీనాక్షి చౌదరి..!?

Anilkumar
ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం' లో మహేష్ బాబు పక్కన అతని మరదలిగా పల్లెటూరి అమ్మాయిలా నటించిన మీనాక్షి చౌదరి, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ పక్కన సినిమాలు చేస్తున్న మీనాక్షి బిజీ నటీమణుల్లో ఒక నటీమణి అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ‘లక్కీ బాస్కర్’, ‘గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)’, ‘విశ్వంభర’, మెకానిక్ రాకీ, మట్కా వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో సెప్టెంబర్ 5న ‘గోట్’, సెప్టెంబర్ 7న ‘లక్కీ

 భాస్కర్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో వీటిపై ఎన్నో హోప్స్ పెట్టుకుంది మీనాక్షి.  వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న మీనాక్షి చౌదరీ తనకు చాలా భయంగా ఉందంటూ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ప్రజెంట్ వరుసగా పాన్ ఇండియా చేస్తుంటే ఓ వైపు ఆనందంగా ఉన్నప్పటికీ మరోవైపు చాలా భయంగా కూడా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఏడాది ‘గుంటూరు కారం’తో మంచి హిట్ అందుకున్న హీరోయిన్‌కు ఈ మూవీస్ ఎలాంటి స్టార్‌ఢమ్‌ను తెచ్చిపెడతాయో వేచి చూడాల్సి ఉంది.  

 ఇక ఈ సినిమా  తన కెరీర్‌ బెస్ట్ అవుతుందని కాన్పిడెంట్‌గా ఉన్నారు మీనాక్షి చౌదరి. వరుసగా ప్యాన్‌ ఇండియా లు చేస్తుంటే ఓ వైపు ఆనందంగా మరో వైపు భయంగా ఉందని అంటున్నారు మీనాక్షి. ఆల్రెడీ ఈ ఏడాది గంటూరు కారంతో సక్సెస్‌ కొట్టారు ఈ లేడీ. అదే జోరుతో పెద్దోడు వెంకటేష్‌ సరసన అనిల్‌ రావిపూడి డైరక్షన్‌లో చేస్తున్నారు. మరోవైపు విశ్వక్‌సేన్‌తో చేస్తున్న అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇక మాస్‌ యాక్షన్‌ కామెడీ అంశాలతో కూడిన ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ ‘మెకానిక్‌ రాకీ’. విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాళ్లూరి రామ్‌ నిర్మాత. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న విడుదల కానుంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లు గా నటిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: