'యుద్ధం గెలిచి వచ్చిన రాముడు' పవన్ పై నిహారిక ఎమోషనల్ కామెంట్స్..!?

Anilkumar
ఆహా లో సర్కార్ నాలుగవ సీజన్ మంచి హిట్ అయ్యింది. సుడిగాలి సుదీర్ హోస్ట్ గా చేస్తున్న ఈ సీజన్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సీజన్ సక్సెస్ అవడంతో ఆహా లో ఒక స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. అయితే దానికి గెస్ట్ గా మెగా డాటర్ నిహారిక వచ్చింది. అయితే సర్కార్ సక్సెస్ పార్టీకి సంబంధించిన చిన్న ప్రోమోను ఆహా ఓటీటీ తీసుకొచ్చింది. తనను ఈ సీజన్‍కు పిలువలేదని, వచ్చే సీజనేనా అని సుధీర్‌తో నిహారిక అన్నారు. "మీ కేంటండి.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలుకా" అని సుధీర్ అన్నారు.

 ఆ తర్వాత గెలిచిన తర్వాత చిరంజీవి ఆశీర్వాదాన్ని పవన్ తీసుకున్న విజువల్స్ ఈ ప్రోమోలో ఉన్నాయి. ఇది చూసిన నిహారిక "యుద్ధం గెలిచాక రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలాగే ఉండిందేమో అనిపించింది" అని అన్నారు. బాబాయ్ పవన్ గురించి నిహారిక చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలువటంతో పాటు డిప్యూటీ సీఎం అయ్యారు. తాను ఎన్నికల్లో గెలిచాక తన అన్నయ్య మెగాస్టార్

 చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్. ఈ సందర్భాన్ని నిహారిక ఈ షోలో గుర్తు చేసుకున్నారు. రాముడు యుద్ధం గెలిచి అయోధ్యకు వచ్చాక ఇలాగే ఉండిందేమో అనిపించిందని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిహారిక విడాకుల తర్వాత నిహారిక మళ్లీ సినిమా లైఫ్‌లో బిజిబిజీగా మారిపోయింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీసుల్లో నిర్మిస్తూనే.. మరికొన్ని సినిమాల్లో నిహా నటిస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ తనకు నచ్చిన ప్రాజెక్టులు చేస్తూ బిజిబిజీగా ఉంటోంది మెగా డాటర్. కాగా ప్రస్తుతం కమిటీ కుర్రోళ్లు అనే సినిమా ప్రమోషన్స్‌ లో ఉంటోంది నిహారిక. సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించాకు. యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాకు నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: