షాక్: లావణ్య త్రిపాఠి కి దూరంగా వరుణ్ తేజ్.. విడాకులు తీసుకోబోతున్నారా..!?

Anilkumar
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు మరో రెండు సినిమాలను ఒప్పుకోగా అందులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ సొంత బ్యానర్ ఇది. ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించబోతున్నారు మేర్లపాక గాంధీ. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వరుణ్ కొరియా వెళుతున్నారు. సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్ లో అక్కడే సినిమాను  


 ముగించబోతున్నారు. ఈ సినిమాతోపాటు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి వరుణ్ ఒప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ కూడా అమెరికాలో జరగబోతోంది. మేర్లపాక గాంధీ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇలా వరుసగా రెండు సినిమాల షూటింగ్స్ కోసం ఎక్కువ కాలం వరుణ్ విదేశాల్లో ఉండబోతున్నాడు.  అయితే ఈ రెండు సినిమాల షూటింగ్స్ కోసమే వరుణ్ తన భార్య లావణ్యను వదిలి కొన్నాళ్ళు

 విదేశాల్లో ఉండబోతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వరుణ్ వరుస మూవీస్ చేస్తూ విజయం కోసం తాపత్రయ పడుతున్నాడు. కానీ హిట్ కొట్టలేకపోతున్నాడు. ప్రజెంట్ ‘మట్కా’ షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక లావణ్య విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత ‘మిస్ ఫర్‌ఫెక్ట్’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ తర్వాత ఎలాంటీ ప్రాజెక్ట్స్ ప్రకటించకుండా సైలెంట్‌గా ఉంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ అడపా దడపా పోస్ట్‌లు పెడుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: