నా బాడీలో ఆ పార్ట్ చూపించడం నాకు ఇష్టం లేదు.. జాన్వి కపూర్..!?

Anilkumar
బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ప్రస్తుతం తెలుగులో దేవర  సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉలజ్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇందులో ఒక డిఫరెంట్ పాత్రలో నటించింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇకపోతే ఉలజ్ సినిమాలో యువ దౌత్య వేత్తగా కనిపించింది జాన్వి. సుధాన్షు

  దర్శకత్వంలో వచ్చిన ఉలజ్ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది జాన్వి కపూర్. అయితే ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరూ ఆమె చెప్పిన విషయాన్ని బాగా గుర్తుంచుకొని పాటిస్తున్నారు అంటూ చెప్పకు వచ్చింది జాన్వి కపూర్. గతంలో మహీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ఫోటోలను వెనకవైపు తీయవద్దని వారిని కోరినట్లు జాన్వీ కపూర్ తెలిపింది. ఎందుకంటే బ్యాక్‌ సైడ్‌ నుంచి ఫోటోలు తీసి.. ఈ నటి ఎవరో ఊహించండి? అంటూ

 క్యాప్షన్‌లు పెడతారని చెప్పింది. అందుకే ఆ యాంగిల్‌లో ఫోటోలు తీయవద్దని వారికి చెప్పినట్లు పేర్కొంది. అలా నన్ను చూపించడం తనకు నచ్చదని.. అంతే కాకుండా నన్ను అలా చూడడం ఇబ్బందిగానే అనిపిస్తుందని వెల్లడించింది. అప్పటి నుంచి వారు అలా చేయడం మానేశారని వెల్లడించింది. ఇప్పుడు వాళ్లే ముందుకు తిరగండి మేడం అంటూ అడిగి మరీ ఫోటోలు తీసుకుంటున్నారని వివరించింది. కాగా.. జాన్వీ చివరిసారిగా స్పోర్ట్స్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించింది. ప్రస్తుతం ఉలజ్‌తో అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, మీయాంగ్ చాంగ్, గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి కీలక పాత్రల్లో నటించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: