అల్లు శిరీష్ బడ్డీ సినిమాలో అలాంటి సీన్స్.. వర్కౌట్ అయ్యేనా..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా బడ్డీ .ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదట ఈ సినిమాను జూలై 26న విడుదల చేస్తాము అని భావించినప్పటికీ ఆగస్టు రెండో తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఎంతోకాలంగా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న అల్లు శిరీష్ కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొడతాడు అని ఆశిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ

 సినిమా పోస్టర్లు, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లువారబ్బాయి నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.  అయితే జూలై 26న కోలీవుడ్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయాన్’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇది ధనుష్ కెరీర్ లో 50వ చిత్రం. పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అల్లు శిరీష్ నటించిన ‘బడ్డీ’ సినిమాని ఆగస్టు ఫస్ట్ వీక్ కి పోస్టుపోన్ చేసినట్లుగా

 తెలుస్తోంది.  ఇదిలవుండగా సినిమాలో జై బాలయ్య  స్లోగన్ వినిపిస్తుందని ఒక యాక్షన్ సీన్ సమయంలో ఈ స్లోగన్ వినిపించడంతో పాటు భగవంత్ కేసరి  థీమ్ మ్యూజిక్ కూడా వినిపించనుందని భోగట్టా. హిప్ హాప్ తమిళ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. బడ్డీ సినిమా కాన్సెప్ట్ కూడా అద్భుతంగా ఉండనుందని భోగట్టా. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. బడ్డీ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటించి రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అల్లు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: