యానిమల్ బ్యూటీకి నేషనల్ క్రష్ ట్యాగ్..!?

Anilkumar
యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది త్రిప్తి. ఈ సినిమా తర్వాత యూత్ లో తనకి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అలా తనకి నేషనల్ క్రష్ అనే గుర్తింపు సైతం లభించింది. యానిమల్ తర్వాత తృప్తి దిమ్రీ ఇప్పుడు ‘బ్యాడ్ న్యూస్’ సినిమా పాటతో వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో తృప్తి మొదటిసారిగా విక్కీ కౌశల్ ‌తో కనిపించింది. ఈ సినిమాలో విక్కీ కౌశల్‌తో త్రిప్తి దిమ్రీ బోల్డ్ సీన్స్ ఇచ్చారు. వీరి రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుర్రాళ్ల నిద్రను దోచుకున్న ఈ బ్యూటీ ఫుల్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. విక్కీ-తృప్తి పాట గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. నటి తృప్తి

 ఇప్పుడు బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీ. యానిమల్ సినిమా తర్వాత త్రిఫ్తీ దిమ్రీకి ఆఫర్ల వెల్లువ వచ్చిపడింది. డిమాండ్ పెరగడంతో నటి  రెమ్యునరేషన్ కూడా పెరిగింది. ‘బ్యాడ్ న్యూస్’లో తృతీయ మరో హాట్ అవతార్‌లో కనిపించనుంది. విక్కీతో కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్, రొమాన్స్ సన్నివేశాల్లో కనిపించింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు నటి  రూ.80 లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది కాసేపు పక్కన పెడితే అభిమానులు తనని 'నేషనల్‌ క్రష్‌' అని పిలవడంపై తాజాగా త్రిప్తి స్పందించారు. ఆ ట్యాగ్‌ విషయంలో తాను ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. ''బాలీవుడ్‌లో కెరీర్‌ మొదలుపెట్టి

 దాదాపు ఏడేళ్లు అయ్యింది. అందుకు సంతోషంగా ఉన్నా. గొప్ప నటీనటులు, దర్శకులతో వర్క్‌ చేస్తానని కెరీర్‌ ఆరంభంలో ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే, యాక్టింగ్‌ను నేను సీరియస్‌గా తీసుకోలేదు. మొదటి సినిమా పూర్తైన తర్వాత కెరీర్‌ను విధికే వదిలేశా. 'ఒక సినిమా పూర్తి చేశా. అదృష్టం ఉంటే రెండో సినిమా రావొచ్చు' అనుకున్నా. అలాంటి సమయంలో 'లైలా మజ్ను' కోసం ఆడిషన్‌లో పాల్గొన్నా. ఆనాటి నుంచి యాక్టింగ్‌పై దృష్టిపెట్టా. నటనలో శిక్షణ తీసుకొన్నా. ప్రేక్షకులు నా నటనతో కనెక్ట్‌ అవుతున్నారు. నేషనల్‌ క్రష్‌ అనేది నా దృష్టిలో ట్యాగ్‌ మాత్రమే కాదు. అభిమానుల ప్రేమ. వాళ్లు నన్ను అలా పిలుస్తున్నందుకు ఆనందంగా ఉన్నా. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. ప్రేక్షకులను అలరించే చిత్రాల్లో నటించాలని తెలియజేసింది'' అని తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: