కల్కి లో ఆ సన్నివేశాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన అమితాబ్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా భారీ సక్సెస్ తో దూసుకుపోతోంది. ఇటీవల 1000 కోట్ల క్లబ్ లో కూడా నిలిచింది ఈ సినిమా. దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన సరికొత్త ప్రపంచం 'కల్కి 2898 ఏడీ'. విజువల్ వండర్‌తో మ్యాజిక్ చేశాడు. హాలీవుడ్‌ను మించిన గ్రాఫిక్స్‌తో థియేటర్లకు పరుగులు పెట్టించాడు. అతడి క్రియేటివిటీకి సినీ ప్రియులు మంత్రముగ్దులైపోయారు. అంతేకాకుండా ఇందులోని యాక్షన్ సీన్లకు విజువల్ ఎఫెక్ట్స్ జోడించి తెరకెక్కిన తీరు అందరిచేత ప్రశంసలు కురిపించింది. ముఖ్యంగా ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్‌ల మధ్య వచ్చే యాక్షన్

 సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా చెప్పుకోవాలి. ఇప్పటికీ దాదాపు రూ.1000 కోట్లు క్రాస్ చేసిన కల్కి ఇప్పుడు రూ.1100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. త్వరలో ఈ మార్క్‌ను చేరుతుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత అలాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ఇదిలవుండగా కల్కి లో కొన్ని సన్నివేశాలపై వస్తోన్న విమర్శలపై అమితాబ్ స్పందించారు. నాగ్ అశ్విన్‌, అమితాబ్‌ల ప్రత్యేక ఇంటర్వ్యూ రెండో ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇందులో సినిమాకు

 సంబంధించిన కొన్ని సన్నివేశాల గురించి వారిద్దరూ చర్చించుకున్నారు. 'కల్క సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్స్‌ గురించి అమితాబ్ మాట్లాడుతూ..'ప్రేక్షకుల కోసమే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రభాస్‌  పరిచయ సన్నివేశం నిడివి ఎక్కువ ఉందని.. స్టోరీలోకి వెళ్తే బాగుండేదని కొందరికి అనిపించి ఉండొచ్చు. ఆ సన్నివేశాన్ని కేవలం ఇంట్రడక్షన్‌ సీన్‌లానే కాకుండా.. ఒక తెలుగు హీరో పరిచయ సన్నివేశంగా చూడాలి. కోట్ల మంది అభిమానులు ప్రభాస్‌ను దేవుడిలా చూస్తారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి' అన్నారు. దీనికి నాగ్‌అశ్విన్‌ స్పందిస్తూ.. 'ఫ్యాన్స్ కోసమే ఇందులో డైలాగ్ ఉంది. నాకు ఫ్యాన్స్ ఉన్నారని భైరవా అంటే.. తెలుసు రెబల్ ఫ్యాన్స్ అని బుజ్జి అంటుంది. దీన్ని చూసి ఆయన అభిమానులు చాలా ఎంజయ్‌ చేసుంటారు. సంతోషించి ఉంటారు' అని తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: