చాలా నాళ్ళ తర్వాత మళ్లీ మీడియా ముందుకు సమంత.. దానికోసమేనా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అనారోగ్యం కారణంగా గ‌త కొంతకాలం నుంచి నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్  భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. అయితే మ‌ళ్లీ తాను సినిమాల‌కు ఎంట్రీ ఇవ్వనున్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఎంతో కాలంగా మీడియాకి దూరంగా ఉన్న సమంతా చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ రిలీజ్‌కు

 రెడీ అవుతున్న నేపథ్యంలో మళ్లీ మీడియాతో టచ్‌లోకి వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్‌ గత మూడేళ్లుగా తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.కొంత కాలం చాలా కష్టాలు పడ్డా అన్న సమంత, ఆ ఇబ్బందులే తనను మరింత బలంగా తయారు చేశాయన్నారు.  అలాంటి రోజులు మళ్లీ తన జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా అన్నారు. అనారోగ్య కారణాలతో షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ, ఇటీవల మా ఇంటి బంగారం పేరుతో ఓ ను ఎనౌన్స్‌ చేశారు. ఖుషి తో పాటు సిటాడెల్‌ ఇండియన్‌ వర్షన్‌ షూటింగ్ పూర్తి చేశారు సమంత. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌


 సిరీస్‌ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. త్వరలో డిజిటల్ ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో లీడ్ రోల్‌లో నటించిన సమంత ప్రమోషన్స్‌కు రెడీ అవుతున్నారు. ఇక సామ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంది. ఈ చిత్రం అనంత‌రం మ‌ల‌యాళంలో మెగాస్టార్ మ‌మ్ముట్టితో ఒక సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు గౌత‌మ్ వాస్‌దేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. మ‌రోవైపు ఈ సినిమాతో పాటు ‘మా ఇంటి బంగారం’ సినిమాను అనౌన్స్ చేసింది. తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: