ఫాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న సూపర్ స్టార్ మహేష్..!?

Anilkumar
సినీ లవర్స్ తమ అభిమాన హీరో పుట్టినరోజుని పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటే కచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే. అందులోనూ మన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వస్తుందంటే కచ్చితంగా ఏదో ఒక పెద్ద ప్లానింగ్ ఉండాలి. మరి ఇలాంటి మన స్టార్ హీరోకి జక్కన్న.. కృష్ణవంశీ ఏం చేస్తారో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.  అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరు ఓ వైబ్రేషన్ ఉంది.. ఓ సెన్సేషన్ ఉంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. అంతే కాదు విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన. ఇప్పటివరకు మహేష్

 బాబు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా ఈ పాన్ ఇండియా స్టార్ హీరోలకు లేని ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. విదేశాల్లోనూ మహేష్ వీరాభిమానులు ఉన్నారు. త్వరలోనే మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదిలా ఉంటే మహేష్ నయా మూవీస్ తో పాటు గతంలో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. మహేష్‌ బర్త్ డే కానుకలుగా లు రీరిలీజులు కావడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా మారింది. ఆ కోవలో ఈ సారి మురారిని థియేటర్లలోకి

 తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  పాత వెర్షన్‌ని 18 నిమిషాలు ట్రిమ్‌ చేసి, 4కేలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట కృష్ణవంశీ. ఏదో ఒక గిఫ్ట్ అని సరిపెట్టుకోవాలా? జక్కన్న జర చూడరాదే అంటూ ఆశగా ఎదురుచూడాలా? అనేది మహేష్‌ ఫ్యాన్స్ డైలమా. ఇప్పటికే పోకిరి, ఒక్కడు సినిమాలు రీ రిలీజ్ అయ్యి నయా రికార్డ్ సృష్టించాయి. ఆతర్వాత చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ బాబు సినిమా రీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న మురారి సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: