మెగా హీరోస్: తమ్ముడి కోసం అంతకు తెగించిన అన్నయ్య..!?

Anilkumar
మెగా హీరో సాయి ధరం తేజ్ విరూపాక్ష తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల వీళ్ళిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం రోహిత్ అనే నూతన దర్శకుడితో తన తదుపరి సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. అయితే కేవలం తన కెరియర్ తానే చూసుకోకుండా తన తమ్ముడి కోసం కూడా సాయి ధరంతేజ్ సరికొత్త కథలను ఎంపిక చేస్తున్నట్లుగా

 సోషల్ మీడియాలో కథనాలు వినబడుతున్నాయి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన వైష్ణవ్  ఈ సినిమా తర్వాత మూడు సినిమాలు చేశాడు. అయితే ఊహించిన విధంగా ఆయన చేసిన మూడు సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. ఉప్పెన   తర్వాత తనకి అంతటి హిట్ మళ్లీ పడలేదు. ఇందులో భాగంగానే ఖచ్చితంగా తన హిట్టు కొట్టాలి అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇక అందుకోసం అన్న సాయి తేజ్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. తన దగ్గరకు వచ్చిన కథలను తనకు

 సూట్ అవ్వకపోతే వైష్ణవ్ కి రిఫర్ చేస్తున్నాడట సాయి తేజ్. అంతేకాదు వైష్ణవ్ కు మంచి కథ కావాలని రైటర్స్ తో చెబుతున్నాడట. తమ్ముడు సక్సెస్ కోసం అన్నయ్య సాయి తేజ్ కష్టపడుతున్నాడు. చివరగా ఆది కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యుంటుందని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈసారి కథా ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. సాయి తేజ్ కూడా తోడయ్యాడు కాబట్టి మెగా హీరోలు ఇద్దరు కలిసి ఒక మంచి కథ పిక్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఆ కథ ఏంటి.. వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది. మెగా అల్లుళ్ల కెరీర్ గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా కాస్త దిగులుగా ఉన్నారని తెలుస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: