మిస్టర్ బచ్చన్ నుండి నెక్స్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా..!?

Anilkumar
మాస్ మహారాజా రవితేజ తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో "మిస్టర్ బచ్చన్" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అంతా  ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాగా ఇందులో అందాల బొమ్మ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హరీష్ శంకర్ మరియు రవితేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి

 రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తోంది. అంతేకాకుండా అభిమానులలో మంచి రెస్పాన్స్ కూడా  వస్తోంది. దీంతో మేకర్స్ అంతా తదుపరి పాట కోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ సింగర్ అయినా శ్రీ రామచంద్ర తో హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ మీకే జె మేయర్ లు కలిసి ఒక పాటను రికార్డ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా త్వరలోనే ఈ పాటకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అని తెలియజేశారు. వీళ్ళ ముగ్గురు కలిసి దిగిన

 ఫోటోలు మీడియాలో షేర్ చేశారు. ఇక ఇది కాసేపు పక్కన పెడితే వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలియజేయనున్నారు. ఇదిలా ఉంటే మాస్ మహారాజా రవితేజ మరియు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా తిరిగి రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ జూలై 27న ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఇక ఈ వార్త విన్న రవితేజ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: