అక్కడ డబుల్ ఇస్మార్ట్ అదిరిపోయే ప్లాన్.. !?

Anilkumar
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ సినిమా డబుల్ స్మార్ట్. టాలీవుడ్ సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళం భాషల్లో ఎంతో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో విడుదల

 చేస్తుండడంతో అదే స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేయబోతున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రమోషన్స్ కు రెడీ అవుతున్నారు అని ముంబైలో ఒక భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు అని చిత్ర యూనిట్ మొత్తం ఇందులో పాల్గొంటుంది అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. ఇస్మార్ట్‌ శంకర్‌కు స్పీకర్‌ అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన

 మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి వర్క్ చేస్తుండటం అంచనాలు భారీగానే ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్‌ ఆదిత్య మ్యూజిక్‌ సొంతం చేసుకుంది. మాస్‌ మ్యూజిక్‌ జాతరలో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన STEPPAMAAR, మార్ ముంతా చోడ్‌ చింతా సాంగ్‌ సాంగ్స్‌కు నెట్టింట మంచి స్పందన వస్తోంది. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి. మరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: