'సరిపోదా శనివారం' నుండి మైండ్ బ్లోయింగ్ అప్డేట్..!?

Anilkumar
రెండు వరుస సాలిడ్ హిట్ సినిమాల తర్వాత నాచురల్ స్టార్ నాని తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో "సరిపోదా శనివారం" అనే సినిమా చేస్తున్నారు. ఇక సినిమాలో అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య విలన్ గా  కనిపించనున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, వీడియోస్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుండగా ఈ సినిమాపై ప్రేక్షకులలో మరింత అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా

 ఇప్పుడు కూడా అలాగే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను  రివిల్ చేశారు మేకర్స. వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టీజర్ పై మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్  రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట మేకర్స్. సరిపోదా శనివారం సినిమా నుంచి జూలై 20 న టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. "రన్ హి ఈజ్ కమింగ్ ఆన్ జులై 20" అంటూ టీజర్ గురించి అప్డేట్ ఇచ్చారు మూవీ టీమ్.  తాజాగా ఇప్పుడు ఈ టీజర్ పై సినీ లవర్స్ కు దీనిపై

 మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా. డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టు 29 న పాన్ ఇండియా లెవెల్  లో రిలీజ్ చేయబోతున్నారు. దాంతో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రెండు హిట్ సినిమాలు తర్వాత నాని ఈ మూవీతో ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి. ఒకసారి అంటే సుందరానికి మూవీతో ఎదురుదెబ్బ ఎదుర్కొన్న నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండవసారి అయినా పెద్ద హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారంలో నాని ప్రత్యేకమైన అవతార్‌లో కన్పించి సర్ప్రైజ్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: