పుష్ప రిలీజ్ కి వరుస అడ్డంకులు.. డిసెంబర్ అయినా ఫిక్స్ అవుతుందా..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా రష్మికా మందన్నా     హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్   తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అలాగే అల్లు అర్జున్ కోసం మరోసారి అంతా ఆసక్తిగా మారగా అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుస్తుంది.  అయితే ఈ సినిమా విడుదల ముందుగా ఆగస్టు 15న అని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసినప్పటికీ దాన్ని డిసెంబర్ చేశారు. మరి ఎందుకు పుష్ప పోస్ట్ ఫోన్ చేశారు అన్న విషయంపై ఎప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. కానీ అందరూ అంటుంది ఏంటంటే.. పుష్ప షూటింగ్ చాలా నెమ్మదిగా జరుగుతుందని అంటున్నారు. ఈ వారంలో ఒక భారీ యాక్షన్ సీన్ కూడా షూట్ చేస్తారని సమాచారం. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు టీం లో కీలక సిబ్బందికి

 ఒకరికి అనారోగ్యం వచ్చిందట. అందుకే ఈ సినిమా షూటింగ్ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.  సుకుమార్ సైతం విదేశాలకు ట్రిప్ కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరికొందరేమో సుకుమార్ కి కాస్త ఆరోగ్యం బాగా లేకపోవడంతో షూటింగ్ వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు. లెక్కన సినిమా రిలీజ్‌కి నాలుగు నెలలు ఉంది. మరి ఈ గ్యాప్‌లో షూటింగ్‌ పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసి రిలీజ్‌కి రెడీ చేయగలరా అనేది ప్రశ్న. మామూలుగానే సుకుమార్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కోసం ఎక్కువ సమయం తీసుకుంటారని ఓ టాక్‌. ఇక ఇంత పెద్ద సినిమాను కనీసం నెల

 రోజులు ప్రచారం చేయాలి. కాబట్టి డిసెంబరు రిలీజ్‌ ఓకేనా? అనేదే ప్రశ్న. 'పుష్ప: ది రైజ్‌' సినిమా విషయంలోనూ ఇలానే జరిగిందనే విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ సినిమాను రిలీజ్‌కు ముందు రోజు వరకు కొన్ని మార్పులు, చేర్పులు చేశారట. ఈ నేపథ్యంలో సుకుమార్‌ ప్రచారం కోసం కూడా ఆయన ముందు రోజు వరకు రాలేదు. దీంతో అల్లు అర్జున్‌  దేవిశ్రీప్రసాద్‌  , రష్మిక మందననే  ప్రచార బాధ్యతలు పోషించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: