'విడాకులు అంటే అంత ఈజీ అనుకుంటున్నారా'.. అభిషేక్ క్లారిటీ..!?

Anilkumar
ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ఇద్దరూ విడిపోయారు అని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ రూమర్స్ వీరిద్దరి వరకు వెళ్లిన కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దానికి తోడు ఈ మధ్యకాలంలో ఐశ్వర్య అభిషేక్ ఇద్దరు కూడా ఎవరికి వారే అన్నట్లుగా తిరుగుతున్నారు. అంతేకాదు ఇటీవల అంబానీ పెళ్లికి కూడా విడివిడిగానే హాజరయ్యారు. మరోవైపు అభిషేక్ మాత్రం అమితాబ్ జయ బచ్చన్ లతో కలిసి అంబానీ పెళ్లి వేడుకలకి వచ్చారు. మరోవైపు ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో

 అంబానీ ఇంట్లో పెళ్ళికి వచ్చింది. ఇలా వీళ్ళిద్దరూ వేరువేరుగా రావడంతో విడాకులు తీసుకునే విడిపోయారేమో అన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. అలా చాలా రోజుల నుండి ఈ వార్తలు వెలుగులోకి వచ్చినప్పటికీ వీటిపై ఏమాత్రం స్పందించలేదు ఈ జోడి. ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పని విడాకుల వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. అదేంటంటే.. తాజాగా ' విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదన్న పోస్ట్‌ను అభిషేక్ బచ్చన్ లైక్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రముఖ రచయిత్రి హీనా ఖండేవాలా ఒక

 పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ విడాకుల గురించి. దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చారు. 'విడాకులు ఎవరికీ అంత ఈజీ కాదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జీవితం సాగదు. దశాబ్దాలుగా కలిసి ఉన్న తర్వాత కూడా విడిపోవాల్సి వస్తుంది. విడిపోయిన తర్వాత, ముఖ్యమైన విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడే వారు ఎలా ఉంటారు? బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది? వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం' అని ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. దీనికి అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: