SSMB 29: మహేశ్ ఫాన్స్ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి .రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అన్న వార్త మాత్రమే అధికారికంగా బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నట్లుగా పలుచోట్ల క్లారిటీ కూడా ఇచ్చారు.

 కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు ఉంది. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరికి కంబోలో రాబోయే సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే మహేష్ బాబు అభిమానులందరూ నిరాశపడే విధంగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమంటే ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన

 ఎలాంటి అప్డేట్ అయితే బయటకు రావడం లేదని తెలుస్తోంది. కాబట్టి మహేష్ బాబు అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టేసుకొని సినిమా నుంచి అప్డేట్ వస్తుందని రెడీగా ఉంటే మాత్రం నిరాశ పడక తప్పదని చెబుతున్నారు. ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో క్లాసిక్ హిట్ గా నిలిచిన మురారి సినిమాని రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది కూడా. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేస్తుండడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: