'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
టాలీవుడ్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ సైతం చేయడం ప్రారంభించారు చిత్రబంధం. ఇందులో భాగంగానే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి హిట్ టాక్ అందుకుంది. అయితే తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ విడుదల పై అప్డేట్ ఇచ్చారు.   మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌టంతో పాట‌ల‌పై కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దానికి త‌గ్గ‌ట్గుగానే

 ”స్టెప్పా మార్” అనే ఫ‌స్ట్ సింగిల్ కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని రెండో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. ‘రియ‌ల్ ఎంజాయ్మెంట్ బిగిన్స్’ అంటూ మేక‌ర్స్ ఈ పాట‌పై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ”మార్ ముంతా చోడ్ చింతా..” అంటూ సాగే ఈ లిరిక‌ల్ వీడియో సాంగ్ ను జూలై 16న రిలీజ్ చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. రామ్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో క‌నిపిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కావ్య థాప‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ సినిమాలో విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఈ సినిమాను పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై ఛార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాధ్ ప్రొడ్యూస్

 చేస్తున్నారు. ఆగ‌స్టు 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు. ఇకపోతే ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా తర్వాత ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా పూరి జగన్నాథ్ కెరియర్ లో పడలేదు. వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా కొంత ఉపశమనం కలిగించింది. ఈ సినిమా తర్వాత పూరి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. లైగర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవలం తెలుగులోనే మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో పరువును పోగొట్టుకున్నారు పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ. మరి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో అయినా పూరి జగన్నాథ్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: