రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన.. అసలేం జరుగుతుంది..!?

Anilkumar
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య ల వ్యవహారమే వినబడుతోంది. టాలీవుడ్ నవ హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడు అని గర్భవతిని చేశాడు అని తన దగ్గర నుంచి భారీ మొత్తంలో నగదు దోచుకున్నాడు అంటూ పెద్ద ఎత్తున రాజ్ తరుణ్ పై విమర్శలు కురిపిస్తోంది లావణ్య. దీంతో ఆమె రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు సైతం వేసింది. టాలీవుడ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా తో రాజ్ తరుణ్ ప్రేమాయణం నడుపుతున్నాడు అని.. తన మాయలో పడి లావణ్యను మోసం చేశాడు అంటూ వాపోతోంది లావణ్య. దీంతో అటు రాజ్ తరుణ్ మరియు మాల్వి

  ఇద్దరిపై కేసు పెట్టింది. ఇదిలవుండగా తాజాగా రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా లావణ్య ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. న్యాయం కోసం తాను ఎంతవరకైనా పోరాడుతానని పేర్కొంది. రాజ్ తరుణ్ తనకి కావాలని కోరుతుంది. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఈ విషయంపై కలుస్తానని లావణ్య పేర్కొంది. పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టమని లావణ్య తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ తన భార్యల విషయంలో ఎవరిని మోసం చేయలేదని పేర్కొంది. రాజ్ తరుణ్ తనకి

 చేసిన అన్యాయాన్ని పవన్ దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పుకొచ్చింది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నానని లావణ్య తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. రాజ్ తరుణ్ తనని వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని, మోసం చేసాడని పవన్ కళ్యాణ్ కి విన్నవించుకుంటానని లావణ్య తెలిపింది. మరో వైపు లావణ్య తరపున కళ్యాణ్ దిలీప్ సుంకర కేసుని టేకప్ చేసి లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: