బాలయ్య బాటలో బెల్లంకొండ అసలు ఏం చేస్తున్నాడు..!?

Anilkumar
టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఎప్పటినుండో ఈ యంగ్ హీరో ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆయన ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఆసక్తికరమైన సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సినిమాకి ముందుగా టైసన్ నాయుడు అనే పేరుతో షూటింగ్ చేయడం ప్రారంభించారు. ఇక ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. సాగర్ కె చంద్ర

 దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మరో పవర్ఫుల్ సినిమాకి బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం  ఇక ఈ సినిమా తన కెరీర్లో 12వ సినిమాగా రాబోతుంది. లూథీర్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. స్క్రిప్ట్ నచ్చడంతో గత రెండేళ్లుగా టీమ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్న యంగ్ హీరో.. ఈ ఏడాదే ఈ సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్నారట. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కే సినిమా కానుంది. చందు మహేష్, సాయి శశాంక్ దీనికి

 నిర్మాతలు. ఈ చిత్రానికి ''హైందవ'' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీలో శ్రీనివాస్ ఒక అఘోరా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సాయి శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకోడానికి వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారని అర్థమవుతోంది. 'టైసన్ నాయుడు'లో పోలీసాఫీసర్ గా, మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ రోల్ లో కనిపించబోతున్నారు. అలానే షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో కౌశిక్ తో చేస్తున్న సినిమా ఒక హారర్ మిస్టరీ. ఇందులో అతని క్యారక్టర్ కొత్తగా ఉండబోతోంది. ఈ క్రమంలో 'BSS 12' చిత్రంలో అఘోరా పాత్రలో నటించే సాహసం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: